కోడెల ఆత్మహత్యను టీడీపీ జగన్ కు ఆపాదించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. కోడెలకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా మొఖం చాటేసిన చంద్రబాబు చనిపోయాక శవరాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాబుకు ప్రేమ ఉంటే కోడెల రాజకీయ వారసులను ప్రకటించాలన్నారు. సత్తెనపల్లి నుంచి కూతుర్ని, నర్సరావుపేట నుంచి కొడుకుని రాజకీయ వారసులుగా ప్రకటించాలని అంబటి అన్నారు.