టీడీపీ ఎమ్మెల్యేపై ఆమంచి హైకోర్టులో పిటిషన్‌

Update: 2019-07-09 07:32 GMT

టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో తప్పుడు ఆఫిడవిట్‌ సమర్పించారని ఆమంచి కృష్ణమోహన్‌ ఆరోపించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. తనకు మరో భార్య, కుమార్తె ఉన్న విషయాన్ని బలరాం దాచిపెట్టారన్నారు. కేవలం ఒక భార్య వివరాలనే వెల్లడించారని.. నలుగురు పిల్లలైతే అఫిడవిట్ లో ముగ్గురని తెలిపారు. బలరాం నాల్గో సంతానానికి సంబంధించి అన్ని ఆధారాలున్నాయని..ఈసీ చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. కరణం బలరాంపై అనర్హత వేటు వేయాలని కోరారు. 

Tags:    

Similar News