గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం, ప్రజల వద్దకే పాలన తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయాల ఏర్పాటుకు పూనుకున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం అన్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన 3నెలల్లోనే ఇంత పెద్దఎత్తున కొత్త ఉద్యోగాలను సృష్టించి రికార్డు టైమ్లో వాటిని భర్తీ చేయడం గత 20ఏళ్ల చరిత్రలోనే ఇదొక సంచలనం అన్నారు. 3నెలల్లో లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి జగన్ రికార్డు సృష్టించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజకీయ జోక్యం లేకుంటే అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనడానికి ఈ ఉద్యోగ నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు.