ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్ సర్వే

CM Jagan: మధ్యాహ్నం ఒంటిగంటకు రాజమండ్రికి సీఎం జగన్

Update: 2022-07-15 04:04 GMT

ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్ సర్వే

CM Jagan: ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రాజమండ్రి చేరుకొని, అక్కడి నుంచి ఏరియల్‌ వ్యూ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. ఇప్పటికే ఏరియల్‌ సర్వే కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. ఏరియల్‌ సర్వే అనంతరం రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం జగన్‌ ఆదేశాలిచ్చారు. వరద ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News