మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి

Update: 2019-11-10 07:20 GMT

గతకొంతకాలంగా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు బలం చేకూర్చేలా వైసీపీ నేతలతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కానీ వైసీపీ అధిష్టానం నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆగిపోయారట. ఈ క్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లతో ఆయన దిగిన ఫోటో ఒకటి హల్చల్ చేస్తోంది. దాంతో గొట్టిపాటి రవి మళ్ళీ పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది. నిజానికి ఈ ఫోటో రాజకీయ చర్చకు దారితీసిన.. ఓ వేడుకలో ఆయన పాల్గొన్నప్పుడు తీసింది. మనవడు సిద్ధాన్ జన్మదిన వేడుకలకు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆహ్వానించారు. శనివారం రాత్రి హైదరాబాద్ లో ఈ వేడుక జరిగింది.

ఈ సందర్బంగా గొట్టిపాటి రవి కూడా హాజరై బాలినేని మనవడిని ఆశీర్వదించారు. ఆ సమయంలో మంత్రులందరితో గొట్టిపాటి రవి చనువుగా మాటామంతి కలిపారు. ఆ సందర్బంగా తీసిన ఫోటో ఇది. గొట్టిపాటి రవికి టీడీపీ లోకన్నా వైసీపీతోనే అభినాభావ సంబంధం ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున అద్దంకి నుంచి గెలిచిన రవి.. ఆ తరువాత పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. అయినా ఎన్నికల ముందు తిరిగి వైసీపీలో చేరాలని తీవ్రంగా ప్రయత్నించారు.. కానీ వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దాంతో టీడీపీ నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఫలితాల అనంతరం టీడీపీ తలపెట్టిన ఏ కార్యక్రమంలోనూ రవి ఆసక్తికనబరచడం లేదు. దీంతో ఆయన పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Tags:    

Similar News