తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడనని ఒట్టుపెట్టుకున్నట్లు తెలిపారు ఎస్వీబీసీ ఛైర్మన్ పృధ్వీరాజ్ . టీటీడీ కార్మికులను రెగ్యులర్ చేయడమే తమ ఎజెండా అన్నారు. .గత ఛైర్మన్లు చేయలేని పనిని తాను చేసిచూపిస్తానని స్పష్టం చేసిన ఆయన కొండదిగితే జగన్ కోసం ఓ సైనికుడిలా పనిచేస్తానన్నారు. జగన్ చేస్తున్న మంచిపనులు చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని... అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.