వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు..
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతున్నాయి.
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతున్నాయి. ఎస్ఈసీ మార్పు మరింత వేడి రాజేస్తుంటే తాజాగా జనసేన నేత . సినీనటుడు నాగబాబు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్..ప్రజా తీర్పు అప్పుడే మర్చిపోతే ఎలా? అంటూ విమర్శలు గుప్పించగా.. జనసేనాని పార్టీ నేత నాగబాబు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను గుంటనక్కతో పోల్చారు. ఈ మేరకు నాగబాబు ట్వీట్ చేశారు.
విజయసాయిరెడ్డిని ఉద్ధేశిస్తూ.. రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంట నక్కలున్న సంగతి మాకు తెలుసు. విజయసాయిరెడ్డి.. మా ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్తో దోస్తీకి రెడీ అన్న మీ గుంటనక్క రాజకీయలు నాకు గుర్తున్నాయి.'' అని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కరోనాతో రాజకీయ వేడి కాస్త చల్లారినా.. మళ్లీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
@vsredyy_Mp .నువ్వు చెప్పింది.correte . ఈ ఎదవ రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంటనక్కలున్న సంగతి మాకుతెలుసు విజయ సాయి రెడ్డి..మరి మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్ తో దోస్తీ కి రెడి అన్నమీ గుంట నక్కరాజకీయలు నాకు గుర్తున్నాయి. pic.twitter.com/r407jkNysM
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 11, 2020