తుదిశ్వాస వరకు టీడీపీలోనే ఉంటా : దివ్యవాణి

షల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలు అవాస్తవం .. నా తుదిశ్వాస వరకు టీడీపీలోనే కొనసాగుతాను . పార్టీ అభివృద్దికి పార్టీ నేత చంద్రబాబుతో కలిసి పోరాడుతాను.

Update: 2019-08-21 13:27 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది . ఇప్పటికే చాలా మంది నేతలు బీజేపీ తీర్దం పుచ్చుకున్నారు . ఇక ఏపీ లో ఇప్పటికే టీడీపీ నుండి సుజనా చౌదరి, సీఎం రమేష్ లు కమలం గూటికి చేరిపోయారు . తాజాగా టీడీపీ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ సాధినేని యామని కూడా బీజేపీ కండువా కప్పెసుకున్నారు. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజుల నుండి సినీ నటి దివ్యవాణి కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపైన దివ్యవాణి స్పందించారు . సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలు అవాస్తవం .. నా తుదిశ్వాస వరకు టీడీపీలోనే కొనసాగుతాను . పార్టీ అభివృద్దికి పార్టీ నేత చంద్రబాబుతో కలిసి పోరాడుతాను. కష్టకాలంలో పార్టీ వెంట ఉన్నవారే నిజమైన నాయకులని ఆమె అన్నారు .. 

Tags:    

Similar News