ప్రముఖ సినీ నటుడు అలీ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్ బీబీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. షూటింగ్ నిమిత్తం జార్ఖండ్ లో ఉన్న అలీ.. తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. కాగా, జైతున్ బీబీ భౌతిక కాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్కు తరలించినట్టు తెలుస్తోంది. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో జైతున్ అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం.