తూ.గో. జిల్లా రాజమండ్రి తాడితోట రైల్వే గేట్ వద్ద ప్రమాదం

* బైక్‌ను ఢీకొట్టిన రైలు.. ముక్కలు ముక్కలైన బైక్ * తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న యువకుడు

Update: 2021-01-27 07:50 GMT

Representational Image

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాడితోట రైల్వే గేట్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని బైక్ తునతునకలైంది. అదృష్టవశాత్తు బైక్‌పై ఉన్న యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రైల్వే గేట్‌ వేసినప్పటికీ యువకుడు నిర్లక్ష్యంగా గేట్‌ కింద నుంచి బైక్‌ను తీసుకువచ్చాడు. ఇక చివరి నిమిషంలో రైలు దగ్గరకు రావడంతో యువకుడు బైక్‌ను సడన్‌గా నిలిపివేశాడు. ఈ క్రమంలో బైక్‌ అదుపు తప్పి పడిపోయింది. ఇక క్షణాల్లో బైక్‌ను రైలు ముక్కలు ముక్కలు అయ్యింది. ఈ దృశ్యGలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Tags:    

Similar News