ఏపీ వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆస్పత్రులపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. మందుల కొనుగోలులో చేతివాటం ప్రదర్శించినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. డాక్టర్ల గైర్హాజరు, ఆలస్యంగా రావడం వంటివి అధికారులు గుర్తించారు. రిజిస్టర్ మెయిన్టెన్స్తో పాటు ఓపీ, ఐపీ పేషంట్స్ వివరాలు తెలుసుకుంటున్నారు. ఈఎస్ఐ ఆస్పత్రులలో జరిగిన మోసాల నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రులపై ఏసీబీ అధికారులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది.