ఏపీ వ్యాప్తంగా టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌లో ఏసీబీ సోదాలు

Update: 2020-02-18 09:57 GMT
ఏపీ వ్యాప్తంగా టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌లో ఏసీబీ సోదాలు

ఏపీ వ్యాప్తంగా టౌన్‌ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో అధికారులు రికార్డ్‌లను పరిశీలించారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులోని మున్సిపల్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించారు. టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌లోని ఫైళ్లను అధికారులు పరిశీలించారు. కడప జిల్లా ఏసీబీ డీఎస్పీ జనార్దన్‌నాయుడు ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి.

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రికార్డులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరో పక్క అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్‌ కార్యాలయం టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.


Full View


Tags:    

Similar News