విజయనగరం జిల్లా పార్వతీపురం ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పార్వతీపురం ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.మోహనరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
శ్రీకాకుళం డిఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మోహన్రావు బంధువుల ఇళ్లలో సైతం ఏక కాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.