టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మాజీ పీఏ సురేష్రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. దీంతో ఆయన ఇంట్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. తనిఖీల్లో రూ.3 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లోని సురేష్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపైనా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న సురేష్రెడ్డిని 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత జేసీ దివాకర్రెడ్డి తన పీఏగా అపాయింట్ చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాడు. దివాకర్రెడ్డిని అడ్డంపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడంటూ, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సురేష్పై ఫిర్యాదులు అందాయి. దాంతో ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో అధికారులు రంగంలోకి దిగారు.. సురేష్ ఇంట్లో తనిఖీలు చేయడంతో రూ.3 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.