ప్రకాశం జిల్లా వెంకటచలంపల్లి వద్ద ప్రైవేట్‌ బస్సు బోల్తా

Prakasam: ఐదుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Update: 2022-07-28 04:15 GMT

ప్రకాశం జిల్లా వెంకటచలంపల్లి వద్ద ప్రైవేట్‌ బస్సు బోల్తా

Prakasam: ప్రకాశం జిల్లా వెంకటచలంపల్లి వద్ద ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి కనిగిరి వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News