YS Viveka: పులివెందులకు చేరుకున్న వాచ్‌మన్ రంగయ్య

YS Viveka: పులివెందులకు చేరుకున్న వాచ్‌మన్ రంగయ్య

Update: 2021-07-24 01:10 GMT

పులివెందులకు చేరుకున్న వాచ్ మన్ రంగయ్య (ఫైల్ ఇమేజ్)

YS Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక వ్యక్తిగా ఉన్న వాచ్‌మన్ రంగయ్య పులివెందులకు చేరుకున్నారు. విచారణ కోసం సీబీఐ అధికారులు రెండు రోజుల క్రితం రంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట రంగయ్య వాంగ్మూలం ఇచ్చారు. విచారణ అనంతరం సీబీఐ అధికారులు పులివెందులకు తీసుకొచ్చి వదిలివెళ్లారు. అయితే.. కోర్టులో ఏం చెప్పానో తెలిదంటున్నారు రంగయ్య. సీబీఐకిచ్చిన వాంగ్మూలం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌ మారింది. పులివెందులకు రాగానే రంగయ్య చుట్టూ జనం చేరారు. ఆయనకు ప్రాణాపాయం ఉందని స్థానికులు అంటున్నారు. వెంటనే భద్రత కల్పించాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News