ఏపీలో కొత్తగా 76 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-06-01 07:41 GMT
Representational Image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 76 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,567 శాంపిల్స్‌ని పరీక్షించగా 76 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 34 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

 రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3118కి చేరింది. తాజా కేసుల్లో నెల్లూరు జిల్లాలో 8 తమిళనాడు కోయంబేడు కాంటాక్ట్‌ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. కోలుకున్న వారి సంఖ్య 2169కి చేరింది. ప్రస్తుతం 885 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 64కి చేరింది. 



 


Tags:    

Similar News