ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-05-26 05:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో (సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకూ) 8,148 సాంపిల్స్ ని పరీక్షించగా.. 48 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. అలాగే 55 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు.

ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2719కు చేరుకుంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 759 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 57కు చేరుకుంది. మొత్తంగా 1903 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.



 

Tags:    

Similar News