ఉత్తరాంధ్రకు కూడా పాకిన కరోనా.. ఒక్క కరోనా కేసు లేని శ్రీకాకుళం జిల్లాలో..

Update: 2020-04-25 10:11 GMT
Representational Image

ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. కొత్తగా 61 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 31కి చేరింది. గత 24 గంటల్లో 61 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 171 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు కరోనా ఉత్తరాంధ్రను కూడా తాకింది. గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర వాసుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. ఈ కేసుల సంఖ్య ఏ మేరకు పెరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News