పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య

Update: 2019-11-03 06:20 GMT

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓక్ మండలంలోని అకుమల్లా గ్రామంలోని తన వ్యవసాయ భూమిలో 22 ఏళ్ల సి పవన్‌కళ్యాణ్‌ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తెలంగాణ రాష్ట్రంలోని జడ్చర్ల అరబిందో ఫార్మాలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం అకుమల్లా గ్రామానికి వచ్చిన ఆ వ్యక్తి, తన కుటుంబ సభ్యులతో తన వ్యవసాయ భూమికి వెళ్లారు. కుటుంబ సభ్యులు పనిలో నిమగ్నమై ఉండగా, పవన్ కళ్యాణ్ పంటల మీద పిచికారీ చేయడానికి తెచ్చిన పురుగుమందును సేవించాడు..

అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు, అయితే అంతకుముందే పవన్ కళ్యాణ్ చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో సమాచారం అందుకున్న సంజమల పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగనపల్లి ఆసుపత్రికి తరలించారు.. శవపరీక్ష పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని సబ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అయితే, మృతుడు చంద్రమౌలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 

Tags:    

Similar News