Andhra Pradesh: విజయనగరం ఎస్పీ రాజకుమారిని దిశా డీఐజీగా నియామకం

Andhra Pradesh: బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Update: 2021-07-07 02:38 GMT

 ఎస్పీ రాజకుమారిని దిశా డీఐజీగా నియామకం (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. 16 మంది ఐపీఎస్‌లకు బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ మంగళవారం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం ఎస్పీగా పనిచేసిన రాజకుమారికి డీఐజీగా ప్రమోషన్‌ ఇచ్చింది ప్రభుత్వం. రాజకుమారిని దిశ డీఐజీగా నియమించింది. ఈమె స్థానంలో దిశా విభాగం ఎస్పీగా పని చేస్తున్న ఎం.దీపికాను నియమించారు. విజయనగరం, నెల్లూరు, కృష్ణా, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు స్థానచలనం కలిగించారు.

Tags:    

Similar News