అనంతపురం జిల్లాలో నీటి సమస్య లేకుండా చూస్తాం : మంత్రి శంకర నారాయణ

Update: 2019-08-24 15:12 GMT

అనంతపురం జిల్లాలో సాగు తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి శంకర నారాయణ హామీ ఇచ్చారు. అందరితో చర్చించి హంద్రీనీవా నీటిని ముందుకు తీసుకెళ్తామని మంత్రి శంకర నారాయణ, ఎంపీ రంగయ్య స్పష్టం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు అనంతపురం జిల్లా జీడిపల్లి కి చేరుకున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఎంపీ తలారి రంగయ్య తో కలిసి మంత్రి శంకరనారాయణ రిజర్వాయర్ ను సందర్శించారు. నీటి పంపకాల విషయంలో ఎవరి అజమాయిషీ, ఆధిపత్యం ఉండదని.. అన్ని ప్రాంతాలకు సమానంగా నీటిని తరలిస్తామని ఆయన చెప్పుకొచ్చారు . 

Full View

Similar News