Governor Green signal to AP 3 Capitals: 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

Governor Green signal to AP 3 Capitals: రాజదానిపై సలహాలు, సూచనలు మేరకు 2019 సెప్టెంబర్ 13 న రిటైర్డ్ ఐఏఎస్ జిఎన్. రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

S. Srikanth
Published on: 1 Aug 2020 10:16 AM IST
Governor Green signal to AP 3 Capitals: 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం
X

Governor Green signal to AP 3 Capitals: రాజదానిపై సలహాలు, సూచనలు మేరకు 2019 సెప్టెంబర్ 13 న రిటైర్డ్ ఐఏఎస్ జిఎన్. రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడునెలలపాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ 2019 డిసెంబర్ 20న తన నివేదికను సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫారస్సు చేసింది.

కమిటీ సమర్పించిన నివేదిక పరిసీలన కొరకు 2019 డిసెంబర్ 29న రాష్ట్రం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 3న బోష్టింగ్ కన్సల్టెన్సీ గ్రూప్ తన నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ సుదీర్గంగా చర్చించింది. అనంతరం 2020 జనవరి 20 హైపవర్ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది.



S. Srikanth

S. Srikanth

Next Story