చేగుంటలో దొంగ ఓటు

చేగుంటలో దొంగ ఓటు
x
Highlights

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. గంటగంటకూ ఓటింగ్ పెరుగుతోంది. పోలింగ్ బూత్‌కు వస్తున్న ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దుబ్బాకలో...

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. గంటగంటకూ ఓటింగ్ పెరుగుతోంది. పోలింగ్ బూత్‌కు వస్తున్న ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దుబ్బాకలో ఇప్పటివరకు దాదాపు 50 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే దుబ్బాక, చేగుంట మండలాల్లో పోలింగ్ మందకొడిగా సాగుతుంది.

నియోజకవర్గం అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరుతుండగా చేగుంటలో మాత్రం ఓ దొంగ ఓటు నమోదైంది. తమ్ముడి ఓటును అన్న వేసి వెళ్లిపోవటంతో అన్న ఆందోళనకు దిగాడు. పోలింగ్ ఏజెంట్లకు తెలిసే జరిగిందని ఆరోపించాడు. దీంతో ఆ ఓటర్‌కు టెండర్ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక మిగిలిన చోట్ల పోలింగ్ సరళి ప్రశాంతంగా జరుగుతున్నట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories