ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు

ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు
x
Highlights

ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు....

ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కూసుమంచి మండలం నాటకన్‌ గూడెంలో బస్సు అదుపుతప్పి శనివారం తెల్లవారుజామున రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రైవేటు బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణారెడ్డి, ఆయన సతీమణి వెంకటమ్మ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.




Show Full Article
Print Article
Next Story
More Stories