Nizamabad: హనుమాన్ మాల ధరించిన విద్యార్థిపై టీచర్ దురుసు ప్రవర్తన.. మంగల్ పహాడ్‌లో నిరసన జ్వాలలు!

ఏడపల్లి (నిజామాబాద్ జిల్లా): పాఠశాలలో క్రమశిక్షణ నేర్పాల్సిన గురువే.. మతపరమైన ఆచారాలను కించపరిచేలా వ్యవహరించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 11 March 2026 6:20 PM IST
Nizamabad: హనుమాన్ మాల ధరించిన విద్యార్థిపై హెడ్ మాస్టర్ దురుసు ప్రవర్తన.. మంగల్ పహాడ్‌లో నిరసన జ్వాలలు!
X

Nizamabad: హనుమాన్ మాల ధరించిన విద్యార్థిపై హెడ్ మాస్టర్ దురుసు ప్రవర్తన.. మంగల్ పహాడ్‌లో నిరసన జ్వాలలు!

ఏడపల్లి (నిజామాబాద్ జిల్లా): పాఠశాలలో క్రమశిక్షణ నేర్పాల్సిన గురువే.. మతపరమైన ఆచారాలను కించపరిచేలా వ్యవహరించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. నిజామాబాద్ జిల్లా ఏడపల్లి మండలం మంగల్ పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే?

మంగల్ పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి హనుమాన్ మాల ధరించి పాఠశాలకు హాజరయ్యాడు. అయితే, సదరు విద్యార్థి పట్ల టీచర్ పద్మజ అత్యంత అనుచితంగా వ్యవహరించినట్లు సమాచారం. మాల ధరించినందుకు విద్యార్థిని పరుష పదజాలంతో దూషించడమే కాకుండా, మానసిక వేధింపులకు గురిచేశారని విద్యార్థి తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

రోడ్డుపైకి చేరిన నిరసన:

ఈ విషయం దావాగ్నిలా వ్యాపించడంతో ఆగ్రహించిన గ్రామస్థులు, హనుమాన్ స్వాములు పెద్ద ఎత్తున మంగల్ పహాడ్ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయురాలి తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. గతంలో కూడా ఈమె ప్రవర్తనపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు టీచర్ పద్మజను తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

రంగంలోకి అధికారులు:

ఆందోళన ఉధృతం కావడంతో సమాచారం అందుకున్న మండల విద్యాధికారి (MEO), ఎస్ఐ రమ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులతో చర్చలు జరిపి, విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. ప్రస్తుతం ఈ ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story