Kishan Reddy: తెలంగాణలో నడుస్తోంది ప్రజాస్వామ్యమా.. లేక పోలీసు పాలనా?

Kishan Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Arun Chilukuri
Published on: 23 March 2026 3:20 PM IST
Kishan Reddy
X

Kishan Reddy: తెలంగాణలో నడుస్తోంది ప్రజాస్వామ్యమా.. లేక పోలీసు పాలనా?

Kishan Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ చేపట్టిన 'చలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని పోలీసు బలగాలతో అడ్డుకోవడం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు సీనియర్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? లేక పోలీసులతో పాలన సాగిస్తున్నారా? అని ఆయన నిలదీశారు.

నిరసన తెలిపే హక్కు లేదా?

శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కాలరాయడం కాంగ్రెస్ అరాచకత్వానికి పరాకాష్ట అని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే అరెస్టులు చేయడం వారి అభద్రతాభావాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను నమ్మించి వంచించిందని ఆరోపించారు. రైతులు, యువత, మహిళలు తమకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఉలిక్కిపడుతోందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కంటే కమిషన్ల వసూళ్లపైనే మక్కువ ఎక్కువగా ఉందని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పోరాటం ఆగదు.. ఇది ఆరంభం మాత్రమే!

అరెస్టులు, లాఠీచార్జీలతో బీజేపీ పోరాటాన్ని అణచివేయలేరని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. "ప్రజల పక్షాన నిలబడి నిలదీయడం మా బాధ్యత. అవినీతి మరియు అసమర్థ పాలనను గద్దె దించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం." అని ఆయన హెచ్చరించారు. త్వరలోనే ప్రజాగ్రహం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story