2029లో సిద్ధిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా.. సీఎం రేవంత్ రెడ్డి ధీమా!

సిద్ధిపేట గడ్డపై 2029లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి గెలిచిన అభ్యర్థిని మంత్రిని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 March 2026 7:33 PM IST
CM Revanth Reddy
X

2029లో సిద్ధిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా.. సీఎం రేవంత్ రెడ్డి ధీమా!

సిద్ధిపేట: సిద్ధిపేట రాజకీయ ముఖచిత్రం మారబోతోందని, 2029లో ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల అజెండా:

వచ్చే 2029 ఎన్నికలకు సంబంధించి సిద్ధిపేటలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. అక్కడ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని ఖచ్చితంగా మంత్రిని చేస్తానని సభాముఖంగా ప్రజలకు మాట ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు తమను ఆశీర్వదించి కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే, సిద్ధిపేట సమగ్ర అభివృద్ధి బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

అభివృద్ధిపై హామీ:

"సిద్ధిపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి కొరత రానీయం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పు కాంగ్రెస్ ద్వారానే సాధ్యం" అని సీఎం పేర్కొన్నారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి పర్యటనతో సిద్ధిపేట కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story