Armoor: మైనర్ బాలికపై వేధింపులు.. ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు!

Armoor: ఆర్మూర్ పట్టణంలో పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసి, ఇబ్బందులకు గురిచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 17 March 2026 11:22 AM IST
Armoor: మైనర్ బాలికపై వేధింపులు.. ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు!
X

Armoor: మైనర్ బాలికపై వేధింపులు.. ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు!

ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ పట్టణంలో పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసి, ఇబ్బందులకు గురిచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంలో నిందితులైన ఆదిల్, షేక్ కైఫ్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఘటన వివరాలు:

పట్టణంలోని బి.సి హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను నిందితులు ఇద్దరూ కలిసి లోబర్చుకున్నారు. నిందితుల్లో ఒకరైన ఆదిల్, స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ నయీమ్ కు మేనల్లుడిగా గుర్తించారు. నిందితులు ఇద్దరూ కలిసి సదరు బాలికను బాలాజీ ఫంక్షన్ హాల్ సమీపంలోని బాలాజీ కాంప్లెక్స్‌లో ఉన్న ఒక అద్దె గదికి తీసుకువెళ్లారు.

స్థానికుల అప్రమత్తతతో బయటపడ్డ వైనం:

ఆ గదిలోకి వెళ్లిన యువకుల ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఇంటి యజమాని భార్య, వెంటనే తన భర్తకు సమాచారం అందించింది. యజమాని అక్కడికి చేరుకుని తలుపులు తీయగా, లోపల ఉన్న వారిని గమనించి నిలదీశారు. వెంటనే స్థానికుల సహాయంతో బాలికను రక్షించి, పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి హిందూ సంఘాలు - పోలీసుల చర్య:

విషయం తెలుసుకున్న బీజేపీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. బాధితురాలికి మరియు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ విచారణ చేపట్టి, నిందితులపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు ధృవీకరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story