Supreme Court: 13 ఏళ్ల నరకయాతనకు ముగింపు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!

Supreme Court: గత 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన 32 ఏళ్ల హరీశ్ రాణా కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Arun Chilukuri
Published on: 11 March 2026 12:19 PM IST
Supreme Court: 13 ఏళ్ల నరకయాతనకు ముగింపు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
X

Supreme Court: 13 ఏళ్ల నరకయాతనకు ముగింపు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!

Supreme Court: గత 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన 32 ఏళ్ల హరీశ్ రాణా కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మానవీయ కోణంలో ఆలోచించిన ధర్మాసనం, అతడికి కారుణ్య మరణం (Euthanasia) పొందేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు బుధవారం తీర్పునిస్తూ.. హరీశ్‌కు అందుతున్న ప్రాణాధార వైద్య చికిత్సను నిలిపివేయొచ్చని పేర్కొంది.

ఏమిటీ విషాద గాథ?

దిల్లీకి చెందిన హరీశ్ రాణా 2013లో చండీగఢ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. యూనివర్సిటీ హాస్టల్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడటంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి హరీశ్ కోమాలోకి వెళ్లిపోయాడు. శరీరం పూర్తిగా చచ్చుబడిపోయింది.

న్యాయ పోరాటం:

ఇన్నేళ్లుగా తమ కుమారుడిని కళ్లముందే జీవచ్ఛవంలా చూస్తూ ఆ తల్లిదండ్రులు మానసికంగా, ఆర్థికంగా చితికిపోయారు. అతడికి ఈ నరకం నుంచి విముక్తి ప్రసాదించాలని కోర్టులను వేడుకున్నారు. గతంలో దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులు వీరి పిటిషన్‌ను తిరస్కరించాయి. అయితే, హరీశ్ కోలుకునే అవకాశం ఏమాత్రం లేదని వైద్యులు తాజాగా నివేదిక ఇవ్వడంతో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని మార్చుకుంది.

గౌరవప్రదమైన మరణం:

జనవరి 13న హరీశ్ తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడిన న్యాయమూర్తులు వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. "మా బిడ్డకు మర్యాదపూర్వక చావును ప్రసాదించండి" అని వారు కోరిన విన్నపాన్ని మన్నిస్తూ.. చికిత్స ఉపసంహరణకు కోర్టు అంగీకరించింది. ఈ తీర్పుతో ఒక సుదీర్ఘ పోరాటానికి మరియు వేదనకు ముగింపు లభించినట్లయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story