BEST2026: 80 దేశాలు, 500ల స్టాల్స్.. ఢిల్లీలో కొలువుదీరిన గ్లోబల్ ఎనర్జీ సదస్సు..

Bharat Electricity Summit 2026: భారతదేశ ఇంధన రంగ భవిష్యత్తును దిశానిర్దేశం చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026' అట్టహాసంగా ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని ద్వారకలోని యశోభూమి (IICC) కన్వెన్షన్ సెంటర్‌లో ఈరోజు ఉదయం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈ సదస్సును ప్రారంభించారు.

Ganesh
Published on: 19 March 2026 3:01 PM IST
BEST2026
X

BEST2026: 80 దేశాలు, 500ల స్టాల్స్.. ఢిల్లీలో కొలువుదీరిన గ్లోబల్ ఎనర్జీ సదస్సు..

Bharat Electricity Summit 2026: దేశ రాజధానిలో ఇంధన రంగానికి సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనతోపాటు సదస్సు 'భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026' ఘనంగా మొదలైంది. గురువారం ఉదయం 9:45 గంటలకు యశోభూమి వేదికగా కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈ మెగా ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ కూడా పాల్గొన్నారు.

విద్యుత్ రంగంలో కొత్త శకం..

ఈ సదస్సు భారత విద్యుత్ వ్యవస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మనోహర్ లాల్ మాట్లాడుతూ, 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. స్మార్ట్ గ్రిడ్లు, గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్‌లో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడి అవకాశాలు..

ఈ నాలుగు రోజుల సదస్సులో (మార్చి 19-22) సుమారు 80 దేశాల నుంచి ప్రతినిధులు, 500 కంటే ఎక్కువ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. 2032 నాటికి భారతదేశ విద్యుత్ ఉత్పత్తి, ప్రసార, పంపిణీ రంగాల్లో సుమారు $50 లక్షల కోట్ల పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తోంది.

సదస్సు ముఖ్యాంశాలు..

ప్రపంచ స్థాయి భాగస్వామ్యం: 25,000 మందికి పైగా సందర్శకులు, 300 మందికి పైగా వక్తలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

నూతన ఆవిష్కరణలు: 100కు పైగా స్టార్టప్‌లు తమ వినూత్న ఇంధన పరిష్కారాలను ఇక్కడ ప్రదర్శించనున్నాయి.

కీలక చర్చలు: గ్రీన్ హైడ్రోజన్, సోలార్ పవర్, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు.

కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ మాట్లాడుతూ, పునరుత్పాదక ఇంధన వనరులను గ్రిడ్‌కు అనుసంధానం చేయడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఈ సదస్సు ఒక చక్కని మార్గదర్శిగా నిలుస్తుందని తెలిపారు.

Ganesh

Ganesh

Next Story