Stock Market Today: వారం ప్రారంభమే నష్టాలతో..భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్

Stock Market Today: గత శుక్రవారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ ఆ సంతోషాన్ని సోమవారం నీరు కారుస్తూ భారీగా పతనం అయింది.

KVD Varma
Published on: 23 March 2026 4:31 PM IST
Stock Market Today: గత శుక్రవారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ ఆ సంతోషాన్ని సోమవారం నీరు కారుస్తూ భారీగా పతనం అయింది.
X

Stock Market Today

Stock Market Today: అంతర్జాతీయ పరిస్థితులు మరోసారి మన స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. శుక్రవారం మార్కెట్ బుల్లిష్ గా ముగిసిన ఆనందం మొత్తం వారం ప్రారంభంలోనే ఆవిరి అయిపోయింది. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన దగ్గర నుంచీ సెన్సెక్స్ కింది చూపులు చూస్తూనే ఉంది. అదే ట్రెండ్ మార్కెట్ ముగిసే వరకూ కొనసాగింది. దీంతో భారీగా క్షీణించిన సెన్సెక్స్ 1,837 పాయింట్లు (2.46%) పడిపోయి 72,696 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 602 పాయింట్లు (2.60%) పడిపోయి 22,513 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆటో, మెటల్, ఎఫ్‌ఎంసిజి స్టాక్‌లు ఈ రోజు అత్యధిక నష్టాలను చవిచూశాయి.

మార్కెట్ పతనానికి 3 ప్రధాన కారణాలు..

  • అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడింది.
  • ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 113 డాలర్లకు పెరిగాయి.
  • అమెరికా, ఆసియా మార్కెట్లలో పతనం మన స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించింది.

ఆసియా మార్కెట్లు ఇలా..

  • పాన్ నిక్కీ సూచీ 3.48% పడిపోయి 51,515 వద్ద ముగిసింది.
  • దక్షిణ కొరియా కోస్పి సూచీ 6.49% పడిపోయి 5,405 వద్ద ముగిసింది.
  • హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 3.54% పడిపోయి 24,382 వద్ద ముగిసింది.
  • చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 3.63% పడిపోయి 3,813 వద్ద ముగిసింది.

అమెరికా మార్కెట్ పడిపోయింది

  • డౌ జోన్స్ 443 పాయింట్లు (0.96%) పడిపోయి 45,577 వద్ద ముగిసింది.
  • టెక్ ఆధారిత సూచీ అయిన నాస్‌డాక్ కాంపోజిట్ 2.01% పడిపోయి 21,647 వద్ద ముగిసింది.
  • ఎస్&పి 500 సూచీ 100 పాయింట్లు (1.51%) పడిపోయి 6,506 వద్ద ముగిసింది.

ముడి చమురు ధరల పెరుగుదల

ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈరోజు ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు 1% పైగా పెరిగి బ్యారెల్‌కు $113 పైన ట్రేడవుతోంది. అదే సమయంలో, భారతీయ ముడి చమురు ధరల బాస్కెట్ బ్యారెల్‌కు $156కి చేరుకుంది.

రూపాయి అత్యంత కనిష్ట స్థాయికి..

ఇరాన్‌తో కొనసాగుతున్న గల్ఫ్ యుద్ధం కారణంగా రూపాయి డాలర్‌తో పోలిస్తే నేడు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. 48 పైసలు క్షీణించి, డాలర్‌తో పోలిస్తే 94.01 వద్ద ముగిసింది.

విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు..

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) మార్చి 20న ₹5,518 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు. అదే కాలంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) ₹5,706 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మార్చి నెలలో ఇప్పటివరకు, FIIలు ₹86,780 కోట్ల విలువైన షేర్లను ఉపసంహరించుకున్నారు. DIIలు ₹101,168 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

శుక్రవారం బుల్లిష్‌గా..

అంతకుముందు, మార్చి 20వ తేదీ శుక్రవారం నాడు, స్టాక్ మార్కెట్ పుంజుకుంది. సెన్సెక్స్ 325 పాయింట్లు (0.44%) పెరిగి 74,532 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 112 పాయింట్లు (0.49%) పెరిగి 23,114 వద్ద ముగిసింది.

KVD Varma

KVD Varma

Next Story