పోలీసులపై యువ మోర్చ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఫైర్‌

పోలీసులపై యువ మోర్చ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఫైర్‌

Arun Chilukuri
Updated on: 24 Nov 2020 7:15 PM IST
పోలీసులపై యువ మోర్చ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఫైర్‌
X

Tejasvi Surya (file image)

ఓయూలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహణతో ఉద్రిక్తత ఏర్పడింది. ఓయూలో రాజకీయ సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, బీజేవైఎం కార్యకర్తలు బారికేడ్లను తొలగించి ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అమరవీరులకు నివాళులు అర్పించేదుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని యువ మోర్చ జాతీయ అధ్యక్షుడు ఎంపీ తేజస్వి సూర్య ప్రశ్నించారు. పోలీసులు కేసీఆర్‌ కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని విమర్శించారు. తెలంగాణలో యువత ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story