YS Sharmila: మీకు రైతు గోస కనబడటంలేదా? ప్రభుత్వంపై షర్మిల పైర్


Ys Sharmila File Photo
YS Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో అన్నదాతలు రోడెక్కుతున్నారని షర్మిలా అన్నారు. ఈ...
YS Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో అన్నదాతలు రోడెక్కుతున్నారని షర్మిలా అన్నారు. ఈ సందర్భంగా ట్విట్ చేశారు. రాష్ట్రంలోని కొనుగోలు సెంటర్లలో వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు రోడ్డెక్కుతున్నారని ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని వైఎస్ షర్మిల ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు ఆలస్యంగా కొంటున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన షర్మిల.. తెలంగాణలో ప్రతి రంగంలోనూ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలపాల్సి వస్తోందని అన్నారు.
'విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి.. న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడ్డెక్కాలి.. కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల తరబడి పంట కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వర్షం పాలైతున్నయి అని మొత్తుకుంటున్నా మీకు రైతు గోస కనపడదు.. వినపడదు..' అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి..న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడెక్కాలి..
— YS Sharmila (@realyssharmila) May 30, 2021
కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల తరబడి పంట కొనుగోలు కేంద్రాల్లో..
వడ్లు వర్షం పాలైతున్నయి అని మొత్తుకుంటున్నా..మీకు రైతు గోస కనుపడదు.. వినపడదు.. pic.twitter.com/KBCpDVEuc0

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



