తృటిలో తప్పిన మరో పరువు హత్య.. బావ‌ను చంపేందుకు క‌త్తితో కోర్టులోకి..

Youth Enter in Rangareddy Court With Knife
x

తృటిలో తప్పిన మరో పరువు హత్య.. బావ‌ను చంపేందుకు క‌త్తితో కోర్టులోకి.. 

Highlights

Rangareddy Court: పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో మరో పరువు హత్య తృటిలో తప్పింది.

Rangareddy Court: పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో మరో పరువు హత్య తృటిలో తప్పింది. అక్కను ప్రేమంచిన వ్యక్తిని చంపేందుకు ఓ యువకుడు ఏకంగా రంగారెడ్డి కోర్టులోకే ప్రవేశించాడు. అయితే భద్రతా సిబ్బంది అలర్ట్‎గా ఉండడంతో గండం గడచింది. గతేడాది మియాపూర్ కి చెందిన ఒక యువతి తన క్లాస్‎మేట్ అయిన అక్బర్ ని ప్రేమించి ఉప్పల్ చెంగిచర్లలోని ఆర్యసమాజ్ లో వివాహం చేసుకుంది. అనంతరం కుటుంబ కలహాలతో మూడు నెలల క్రితం డైవోర్స్‎కి అప్లయి చేసుకున్నారు.

అయితే అమ్మాయి తమ్ముడు సాయికిరణ్ మాత్రం అక్బర్‎పై కోపం పెంచుకున్నాడు. ఇవాళ కోర్టుకు హాజరవుతున్న విషయం తెలుసుకొని నడుములో కత్తి పెట్టుకుని తన మిత్రునితో కలిసి కోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే సాయికిర‌ణ్ క‌త్తి ప‌ట్టుకుని తిర‌గ‌డాన్ని సెక్యూరిటీ సిబ్బంది ప‌సిగ‌ట్టారు. దీంతో అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories