ఇద్దరు ప్రియుళ్లతో కలసి.... భర్తను చంపేందుకు భార్య ప్లాన్...

ఇద్దరు ప్రియుళ్లతో కలసి.... భర్తను చంపేందుకు భార్య ప్లాన్...
x
Highlights

కరీంనగర్ లో కట్టుకున్న భర్తనే హత మార్చేందుకు ప్లాన్ వేసింది భార్య. ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చడానికి...

కరీంనగర్ లో కట్టుకున్న భర్తనే హత మార్చేందుకు ప్లాన్ వేసింది భార్య. ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చడానికి ప్రణాళిక రచించింది. చివరి నిమిషంలో బాధితుడు వారి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కరీంనగర్‌కు చెందిన వంశీకృష్ణకు, కావేరి అనే యువతితో పెళ్లయింది. కావేరి గణేష్, సమాన్విత్ అనే ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త వంశీకృష్ణకు ఆమె రాసలీలలు గురించి చుట్టుపక్కల వాళ్లు తరచూ చెబుతుండేవారు. కానీ అతను ఆమెను ఏ ఒక్క సందర్భంలో కూడా అనుమానించలేదు.

కానీ అనుకోకుండా ఒక రోజు వంశీకృష్ణ తన భార్య మొబైల్ యూజ్ చేస్తుండగా అతనికి కావేరి ఇద్దరు వ్యక్తులతో కలిసి తీసుకున్న అశ్లిల ఫోటోలు కనిపించాయి. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన వంశీకృష్ణ తన భార్యను నిలదీశాడు. అయితే, తమ గుట్టు బయటపడిపోవడంతో కావేరి భర్తను అంతం చేయాలనుకుంది. అతడు నిద్రపోతున్న సమయంలో తన ఇద్దరు ప్రియుళ్లతో కలసి అతడి ముఖం మీద దిండు అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేయాలని ప్లాన్ వేశారు. అది అమలు చేసే క్రమంలో ఈ నెల 14న పొదున్నే 6 గంటల సమయంలో గణేష్, సమాన్విత్ కావేరి ఇంటికి వచ్చారు. బాధితుడు వారి నుంచి తప్పించుకుని గోడ దూకి పారిపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత భార్యాబాధితుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఇద్దరు నిందితులు సమాన్విత్, గణేష్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories