తెలంగాణలో వరుస ఎన్కౌంటర్లకు కారణం ఏమిటి?

తెలంగాణ వస్తే.. ఎన్ కౌంటర్లే ఉండవన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఎందుకు నిజం కావడం లేదు. రాష్ట్రంలో మళ్లీ...
తెలంగాణ వస్తే.. ఎన్ కౌంటర్లే ఉండవన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఎందుకు నిజం కావడం లేదు. రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల అలజడి, వరుస ఎన్కౌంటర్లు జరగడానికి కారణాలెంటి.? నయా రాష్ట్రంలో పేలిన తూటాలెన్ని దొరికిన తుపాకులెన్ని.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో 11 ఎన్కౌంటర్లు జరిగాయి. ఇప్పటి వరకు 26మంది చనిపోయారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లో అలజడి తారా స్థాయికి చేరింది. ఆదిలాబాద్, మంగ్లీ మన్నెం ఇప్పటికీ నిద్ర పోవడం లేదు. అటు పోలీసులు, ఇటు మావోలు తుపాకుల మోత మోగిస్తున్నారు. గడిచిన మూడు వారాల్లోనే జరిగిన 4 ఎన్కౌంటర్లలో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఈ సందర్భంగా ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు ఉద్యమ నేత కేసీఆర్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నాయి.
తెలంగాణ వచ్చాక 2015 జూన్లో 19 ఏళ్ల వివేక్ సహా ఇద్దరు మహిళా మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 15న ఉమ్మడి వరంగల్ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో శ్రుతి, సాగర్ పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. ఆ తర్వాత చాలా కాలంపాటు మావోయిస్టు కార్యకలాపాలు, ఎన్కౌంటర్ల ముచ్చటే వినిపించలేదు. తర్వాత మళ్లీ 2017 డిసెంబర్ 14న తుపాకుల మోత వినిపించింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా బోడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 9మంది నక్సల్స్ ప్రాణాలు విడిచారు. ఇలా తరుచూ అక్కడక్కడ మావోల ఏరివేత జరుగుతూనే ఉంది.
కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రాక, ఉపాధి లేక తీవ్ర నిరాశలో ఉన్న యువత పోరు బాట పడుతున్నాయి. ఇక పోడు, అసైన్డ్ భూములను వివిధ అవసరాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడాన్ని గిరిజన, దళిత, ఇతర బలహీనవర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని మావోయిస్టులు జనాలకు దగ్గరవుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇందుకు తగినట్లే సానుభూతిపరులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.
లాక్డౌన్ టైంలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోకి మావోయిస్ట్ దళాలు, ప్రత్యేకంగా పది యాక్షన్ టీంలు ప్రవేశించాయని నిఘా వర్గాలు పసిగట్టాయి. అందుకే సరిహద్దు జిల్లాల్లో వేలాది బలగాలతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఒక దశలో డీజీపీ మహేందర్రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్ వెళ్లి నాలుగురోజుల పాటు అక్కడే ఉండి ఈ కూంబింగ్ను పర్యవేక్షించారు. ఇలాంటి ఘటనలతో ప్రశాంతంగా ఉన్న పచ్చని అడవుల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందో అని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
Minister KTR: హైదరాబాద్కు జుమ్లా జీవులు వస్తున్నారు.. అయితే జుమ్లా...
27 Jun 2022 8:42 AM GMTగజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించిన మంత్రులు
27 Jun 2022 8:31 AM GMTLIC Policy: ప్రతిరోజు రూ.100 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై 20 లక్షలు...
27 Jun 2022 8:30 AM GMTఈ నెల 30 న PSLV-C-53 ప్రయోగం
27 Jun 2022 8:07 AM GMTవిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్.. హాజరైన...
27 Jun 2022 7:42 AM GMT