Homeopathy: కరోనా కట్టడికి హోమియో మందు.. 24 గంటల్లో కరోనా తగ్గిస్తానంటున్న డాక్టర్ వి.ఎస్.రెడ్డి

Homeopathy: కరోనా కట్టడికి హోమియో మందు.. 24 గంటల్లో కరోనా తగ్గిస్తానంటున్న డాక్టర్ వి.ఎస్.రెడ్డి
x
Highlights

Homeopathy: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది. ప్రపంచంలో పేరొందిన వైద్య సంస్థలన్నీ కరోనాను అంతమొందించేందుకు అన్ని ప్రయత్నాలు...

Homeopathy: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది. ప్రపంచంలో పేరొందిన వైద్య సంస్థలన్నీ కరోనాను అంతమొందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మందులు అందుబాటులోకి రాలేదు. ఐతే తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే కరోనాను కడిగేస్తానని అంటున్నాడు ఓ హోమియో వైద్యుడు. ఆసక్తి కలిగిస్తున్న ఈ వార్తను మీరు చూడండి.

వరంగల్ నగరంలో ఓ డాక్టర్ మాస్కులు పెట్టుకుని వచ్చే పేషెంట్లకు వైద్యం చేయబోనంటు మొండికేస్తున్నాడు. కరోనా పాజిటివ్ వ్యక్తిని కూడా పక్కన కూర్చోబెట్టి వైద్యం చేస్తున్నారు. నమ్మలేకపోతున్నారా ఈయన పేరు డాక్టర్ వి ఎస్ రెడ్డి. హోమియో వైద్యుడు. ఉండేది హన్మకొండలోని బాలసముద్రం. కరోనాకు మందు వచ్చేసిందని. తాను ట్రీట్ చేస్తున్న పేషెంట్లకు వైద్యం అందిస్తున్నానని చెబుతున్నారు. జర్మన్ న్యూ మెడిసిన్ పేరుతో తయారు చేసిన మందు బిల్లలను రోగులకు అందిస్తున్నారు. కేవలం 24 గంటల్లోనే కరోనా మాయమౌతుందని చెబుతున్నారు. అలాగే కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా మందులు కూడా ఇస్తున్నానని చెబుతున్నారు. తన వద్దకు వచ్చే అందరికీ కరోనా నుంచి విముక్తి కలిగిందంటున్నారు.

అంతేకాదు తన కుమారుడితో పాటు తన వద్ద పనిచేస్తున్న సిబ్బంది నాలుగు నెలలుగా ఎలాంటి మాస్క్ ధరించకుండా చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారు. ప్రతీరోజు హస్పిటల్ ముందు ఒక లిక్విడ్ చల్లుతామని దానివల్ల కరోనా పాజిటివ్ రోగులు వచ్చినా ఏమీ కాదంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో తన వద్దకు వచ్చిన కరోనా పేషెంట్లను సైతం ట్రీట్ చేసి కేవలం 12 గంటల్లోనే నయం చేశానని చెబుతున్నారు. ఇటీవలె భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కుటుంబం, సిబ్బందికి ముందస్తు మందులు ఇచ్చానని అయితే మందులు వాడిన 16 మందికి కరోనా రాలేదని. తన మందులు వాడని ఇద్దరికి కరోనా సోకిందని చెబుతున్నారు. వాళ్లంతా కలిసే ఉంటారని మందులు వాడిన వారికి కరోనా రాకపోవడమే తన ట్రీట్ మెంట్ సక్సెస్ కి నిదర్శమంటున్నారు డాక్టర్ వి ఎస్ రెడ్డి.

వి ఎస్ రెడ్డి వైద్యంపై నమ్మకం కుదిరిన వారు ఆయన ఆస్పత్రి ముందు క్యూ కడుతున్నారు. ఈ వైద్యంపై సోషల్ మీడియాలో రోజు రోజుకు వైరల్ అవుతుండటంతో జనం భారీగానే తరలివస్తున్నారు. ఉదయమే ఆస్పత్రి ఎదుట క్యూలైన్లు ప్రత్యక్షమౌతున్నాయి. ఇందులో కరోనా పాజిటివ్ రోగులే ఎక్కువగా వస్తున్నారు. వారితో పాటు ప్రివెన్షన్ మందుల కోసం కూడా జనం వస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని మందులు కరోనాకు వాడండి అని చెప్పడం విడ్డురంగా ఉంది. ఇలాంటి వారిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.

అయితే విఎస్ రెడ్డి వైద్యానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు ఇటువైపు చూడటం లేదు. ప్రభుత్వం తన వైద్యాన్ని స్వీకరించాలని ఎంజీఎంలో, కేఎంసీ ఆస్పత్రిలో తనకు ఒక వార్డు కేటాయించాలని వి ఎస్ రెడ్డి కోరుతున్నారు. కేవలం 24 గంటల్లోనే కరోనా పాజిటివ్ నుంచి విముక్తి కల్పిస్తానంటున్న ఈయన సవాల్ ను ప్రభుత్వం స్వీరిస్తుందా...? మరింత ప్రోత్సాహం కల్పిస్తుందా లేదంటే శాస్త్రీయ ఆధారాల కోసం సిఫారసు చేస్తుందా చూడాలి.



Show Full Article
Print Article
Next Story
More Stories