Vemula Prashanth Reddy: ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలి

Vemula Prashanth Reddy: నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Arun Chilukuri
Published on: 17 Dec 2025 1:00 PM IST
Vemula Prashanth Reddy: ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలి
X

Vemula Prashanth Reddy: ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలి

Vemula Prashanth Reddy: నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం తన స్వగ్రామమైన వేల్పూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.

ఓటు వేసిన అనంతరం ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉండే వ్యక్తులనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "ప్రజల కోసం నిరంతరం పనిచేసే వారు, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించే వారినే ఓటర్లు ఎన్నుకోవాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. చదువుకున్న వారు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చి గ్రామాల భవిష్యత్తును నిర్ణయించాలని ఆయన ఆకాంక్షించారు. చివరి విడత కావడంతో జిల్లావ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story