VNR విజ్ఞాన జ్యోతి కాలేజీలో కలకలం.. బీటెక్ విద్యార్థినిపై అఘాయిత్యం..

VNR విజ్ఞాన జ్యోతి కాలేజీలో కలకలం.. బీటెక్ విద్యార్థినిపై అఘాయిత్యం..
x

VNR విజ్ఞాన జ్యోతి కాలేజీలో కలకలం.. బీటెక్ విద్యార్థినిపై అఘాయిత్యం..

Highlights

VNR Vignana Jyothi College: నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ బాచుపల్లి VNR విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

VNR Vignana Jyothi College: నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ బాచుపల్లి VNR విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యను అభ్యసించాల్సిన చోట తోటి విద్యార్థులే కిరాతకంగా ప్రవర్తించి, ఒక విద్యార్థినిపై వేధింపులకు మరియు అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

బాధితురాలు ఈ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. తన కుమార్తెను అదే కాలేజీకి చెందిన ఆశీష్ అనే విద్యార్థి గత ఏడాది కాలంగా వేధిస్తున్నాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు కేవలం వేధింపులకే పరిమితం కాకుండా, విద్యార్థినిపై అఘాయిత్యానికి కూడా పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రధాన నిందితుడు ఆశీష్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రవీణ్ అనే మరో విద్యార్థి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలతో విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కాలేజీ యాజమాన్యం ఈ విషయంలో ఎంతవరకు స్పందిస్తుందనేది వేచి చూడాలి. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు. వేధింపులకు పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories