కలకలం రేపిన బాలిక హత్య.. అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారా ? ప్లాన్ ప్రకారమే హత్య చేశారా ?

Vikarabad Tenth Class Girl Assassination Case Twists | Breaking News
x

కలకలం రేపిన బాలిక హత్య.. అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారా ? ప్లాన్ ప్రకారమే హత్య చేశారా ?

Highlights

Vikarabad: తమ వారిని ఇరికించారంటున్న అనుమానితుల పేరెంట్స్...

Vikarabad: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో హత్య కలకలం రేపింది. బాలిక హత్యతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారా ? లేక ప్లాన్ ప్రకారమే హత్య చేశారా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మైనర్ బాలిక హత్యలో ఏం జరిగిందో గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం.

పదోతరగతి చదువుతున్న మైనర్ బాలిక హత్య కేసులో పోలీసులు ఘటన స్ధలంలో మరోసారి హైదరాబాద్ క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. హత్య జరిగిన ప్రదేశంలో నిందితుల సెల్ ఫోన్ లొకేషన్ వివరాలు కూడా తీసుకునే పనిలో ఉన్నారు. దాదాపు 500 మీటర్ల చుట్టూ లొకేషన్ ఉన్న ఫోన్ నెంబర్ వివరాలు తీసుకున్నారు పోలీసులు.

మైనర్ బాలిక హత్య కేసులో అనుమానిస్తున్న నాని అలియాస్ మహేందర్ తో పాటు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానీ వారి కుటుంబ సభ్యులు తమ కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని వాపోతున్నారు. తన కొడుకు తప్పు చేసి ఉంటే కచ్చితంగా శిక్షించాలని కోరుతున్నారు.ఈ కేసులో కక్ష పూర్వకంగా తమ కొడుకులను ఇరికించారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘటనను న్యూ డెమోక్రసీ , పిఓడబ్ల్యు, మానవ హక్కుల సంఘాలు ఇతర సంఘాలు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేశాయి. దేశంలో నిర్భయ చట్టం వచ్చినా అమ్మాయిల పైనా అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అమ్మాయి గ్రామంలో అందోళన చేపట్టారు.

కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మైనర్ బాలిక తల్లి సమాధానాలు కూడా పొంతన లేకుండా చెప్పడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో అనుమానితులు చెప్పే స్టేట్మెంట్ ఆధారంగా నిందితులను పట్టుకునే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories