
Vijaya Shanthi: ఈటల, రేవంత్ వివాదంపై విజయశాంతి ట్వీట్
Vijaya Shanthi: ప్రతిపక్షాల పరస్పర మాటల దాడులు..బీఆర్ఎస్కు వేడుకలవుతున్నాయి
Vijaya Shanthi: బీజేపీ నేత ఈటల, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం.. మాటల యుద్ధంపై బీజేపీ నేత విజయశాంతి ట్వీట్ చేశారు. ఎవరి ధోరణిలో వాళ్లు ప్రభుత్వంపై పోరాడాలని కోరారు. ప్రతిపక్షాల పరస్పర మాటల దాడులు బీఆర్ఎస్కు వేడుకలవుతున్నాయని తెలిపారు విజయశాంతి. తెలంగాణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న ఇద్దరికీ.. ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని చెప్పడం నా బాధ్యతగా అనిపించిందంటూ ట్వీట్ చేశారు విజయశాంతి.
ఈ విధానాన్ని అధికారపార్టీ ప్రజాస్వామ్య హనన రాజకీయ దుష్కృత్య ధోరణులపై కాక,ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల,సవాళ్ల దాడులు, బీఆరెస్కు వేడుకలవుతున్నాయి. బీఆరెస్తో పోరాడే తమ్ముళ్లు రేవంత్ గారు,ఈటలగారు తమ దాడిని ఒకరిపై ఒకరు కాకండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో
— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 22, 2023
ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ... నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో నా బాధ్యత అనిపించింది.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 22, 2023

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




