Yadadri: వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలకు సిద్ధమవుతున్న యాదాద్రి

Varshika Brahmotsavalu From March 4 In Yadadri Temple
x

Yadadri: వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలకు సిద్ధమవుతున్న యాదాద్రి

Highlights

Yadadri: మార్చి 4 నుంచి 14 వ‌ర‌కు ఉత్స‌వాలు

Yadadri: తెలంగాణ‌లోని యాదాద్రి లక్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆలయం వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు సర్వం సిద్ధ‌మైంది. మార్చి 4 నుంచి 14 వరకు బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా తెలంగాణ స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా మార్చి 11న బాలాల‌యంలో స్వామి వారి తిరు కళ్యాణం జ‌ర‌గ‌నుంది. 10 తేదీ గురువారం రాత్రి 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం, 11వ తేదీ ఉదయం 11 గంటలకు స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, 12న రాత్రి 7 గంటలకు స్వామి వారి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారని ఏవో తెలిపారు. ఉత్సవాలన్నీ బాలాలయంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తామని ఏవో గీత తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories