వరంగల్ ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారు: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Arun Chilukuri
Published on: 4 March 2021 5:03 PM IST
Uttam Kumar Reddy Fires On CM KCR
X

వరంగల్ ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారు: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

వరంగల్‌ జిల్లా ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని టీపీసీసీ చీఫీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీకి ఇప్పటి వరకు వీసీని నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సూచించారు. వరంగల్‌ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు, ప్రొఫెసర్‌లను కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story