ఏడుగంటలైంది..ఇరవైశాతమే..!

ఏడుగంటలైంది..ఇరవైశాతమే..!
x
Highlights

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.2 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా గుడిమల్కాపూర్‌లో 49.19 శాతం పోలింగ్ నమోదు...

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.2 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా గుడిమల్కాపూర్‌లో 49.19 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా తలాబ్‌ చంచలంలో 0.74, అమీర్‌పేట్‌లో 0.79 పోలింగ్‌ శాతం నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఓటు వేసేందుకు కేవలం మరో 4 గంటల సమయం మాత్రమే ఉంది.

ఓ వైపు సెలబ్రిటీలు ఓటేసేందుకు ఉత్సాహం చూపుతున్నా సాధారణ పబ్లిక్ మాత్రం పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు. ఇక లాక్‌డౌన్ నుంచి దాదాపు టెకీలంతా నగరాన్ని విడిచి వెళ్లటంతో కూడా పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని అధికారులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories