దుబ్బాకలో గెలుపు బీజేపీకి బూస్టింగ్ లాంటిది : కిషన్ రెడ్డి

దుబ్బాకలో గెలుపు బీజేపీకి బూస్టింగ్ లాంటిది :  కిషన్ రెడ్డి
x
Highlights

దుబ్బాక గేలుపు పైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.. టీఆర్ఎస్‌‌కు పట్టున్న దుబ్బాకలో గెలవటం, తమ పార్టీకి బూస్టింగ్ ఇస్తుందన్నారు . దుబ్బాకలో గెలుపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పనిచేయటానికి దోహదపడుతుందన్నారు.

దుబ్బాక గేలుపు పైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.. టీఆర్ఎస్‌‌కు పట్టున్న దుబ్బాకలో గెలవటం, తమ పార్టీకి బూస్టింగ్ ఇస్తుందన్నారు . దుబ్బాకలో గెలుపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పనిచేయటానికి దోహదపడుతుందన్నారు. ఎక్కడైనా అభ్యర్థి ప్రాధాన్యతగానే ఎన్నికలు జరుగుతాయని.. అభ్యర్థి గెలుపు, పార్టీ గెలుపును వేరు చేసి చూడొద్దన్నారు.

ఇక దుబ్బాక, బీహార్‌ విజయాన్ని ప్రజావిజయంగా అభివర్ణించారు ఏపీ బీజేపీ అధ‌్యక్షులు సోము వీర్రాజు. కుల, మతాలకు అతీతమైన విజయాన్ని ప్రజలు మోదీకి అందిచారన్నారు ఆ‍యన. నీతిని, నితీష్‌ను ప్రజలు స్వాగతించారన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఏపీలో ఇలాంటి విజయాలే చూస్తారన్నారు సోము వీర్రాజు. ఇక అటు దుబ్బాక, ఇటు బీహార్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో విజయవాడలోని బీజేపీ కార్యాలయం దగ్గర పార్టీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. అటు 2024ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలయికతో ఏపీలో అధికారంలోకి వస్తామంటున్నారు కమళనాథులు.

అటు ఉపఎన్నికలో సంచలన విజయం సాధించి బీజేపీ మొదటిసారి దుబ్బాకలో విజయకేతనం ఎగురవేసింది. 14వందల ఓట్లకు పైగా తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత మీద బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలలో సాగిన లెక్కింపులలో రఘునందన్ రావు కు 62,772 ఓట్లు రాగా, సోలిపేట సుజాతకి 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి.. ఓట్ల శాతంగా చూసుకుంటే.. బీజేపీకి 39%, టీఆర్ఎస్ కి 37% ఓట్లు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories