Karimnagar: కరీంనగర్‌కు చేరుకున్న కిడ్నాప్ అయిన ఇద్దరు చిన్నారులు

Two Kidnapped Children Reached Karimnagar
x

Karimnagar: కరీంనగర్‌కు చేరుకున్న కిడ్నాప్ అయిన ఇద్దరు చిన్నారులు

Highlights

Karimnagar: రెండు రోజుల క్రితం చాక్లెట్లు కొనిస్తానని చెప్పి కిడ్నాప్

Karimnagar: రెండు రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన చిన్నారులు కరీంనగర్‌కు చేరుకున్నారు. చిన్నారులు అక్షిత, లోకేశ్‌కు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి రెండు రోజుల క్రితం మహారాష్ట్రకు వృద్ధురాలు జయశ్రీ తీసుకెళ్లింది. కాగా జాల్నా రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఇద్దరు చిన్నారులను జయశ్రీ కొట్టింది. అనుమానంతో పిల్లలను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరు పిల్లలు తమ అదుపులోనే ఉన్నారని మహారాష్ట్ర పోలీసులు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో ఇద్దరు చిన్నారులతో రైలెక్కి వృద్ధురాలు ఔరంగాబాద్ తీసుకెళ్లింది. కిడ్నాప్ చెర నుంచి తమ ఇంటికి చిన్నారులు చేరినందుకు చిన్నారుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories