తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తకు గౌరవ డాక్టరేట్

తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తకు గౌరవ డాక్టరేట్
x
Trs MP Pasunuri Dayakar
Highlights

Trs MP Pasunuri Dayakar : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త పసునూరి దయాకర్‌ గౌరవ...

Trs MP Pasunuri Dayakar : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త పసునూరి దయాకర్‌ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు అందించే గౌరవ డాక్టరేట్ ఆయనను వరించింది. ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో దయాకర్ కేసీఆర్ వెంట నడిచారు. 2015 వరంగల్ లో ఉప ఎన్నికలలో గెలిచిన లోకసభ సభ్యుడు. వరంగల్లు (ఎస్.సి) వరంగల్ నుండి 16వ లోక్ సభకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరుపున నుండి ప్రస్తుత 17వ లోక్ సభ ఎన్నికలలో 2వ సారి విజయం సాధించిన లోక్‌సభ సభ్యుడు. కాగా ఆయన కళా రంగంలో తెలంగాణ తల్లి ప్రతిమను (విగ్రహాలను) రూపొందించినందుకు 'గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ' ఈ రోజు హైదరాబాద్ లో అవార్డు ప్రధానం చేసింది. ఆయన వరంగల్ జిల్లా సంగెం మండలం లోని బొల్లికుంట గ్రామంలో పసునూరి కమలమ్మ, ప్రకాశం దంపతులకు 1967 ఆగస్టు 2 న జన్మించారు. దయాకర్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆయన హైదరాబాద్ జేఎన్టీయూలో బీఏ ఫైన్‌ ఆర్ట్స్‌ చదివారు. ఆయన వృత్తి రీత్యా చిత్రకారుడు, ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సృష్టించాడు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి అందరి మన్ననలను పొందారు.

టీఆర్ఎస్ ఆవిర్భావం 2001 నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ, రాఫ్ల ఏర్పాటుకు ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 2001 నుంచి 2009 వరకు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి 2011 వరకు జిల్లా టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్టీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆరెస్ లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయూకర్ ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల పట్టుసడలని విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్ కు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది.

2015 వరంగల్ ఉపఎన్నిక పోరు ఓ రికార్డు. రాష్ట్ర చరిత్రలో భారీ మేజారిటీ నమోదు అయ్యింది. పసునూటికి 6,15, 403 ఓట్లూ రాగ. కాంగ్రేస్కు సర్వే సత్యనారాయణకు 1, 56, 315 ఓట్లూ వచ్చినవి . భారతీయ జనతా పార్టీడా. పగిడిపాటి దేవయ్యకు 1,30, 178 ఓట్లూ వచ్చినవి, కాగా పసునూటి ఓట్లూ 4,59,092 భారీ మేజారిటీ నమోదు అయ్యింది.




Show Full Article
Print Article
Next Story
More Stories