అది అవాస్తవమని నిరూపిస్తే నగ్న ప్రదర్శన చేస్తా: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

trs mla muthireddy yadagiri reddy sensational challenge to BJP Leaders
x
Highlights

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించారని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే...

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించారని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన లక్షా 30 వేల కోట్లు ఎగ్గొట్టిందన్నారు. ఇది వాస్తవం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిరూపిస్తే తాను జనగామ నియోజకవర్గంలో అర్ధనగ్న ప్రదర్శన చేస్తానని కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్ర అభివృద్దిపై చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి నిధులు విడుదల అయ్యేలా చూడాలని అన్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం, బీజేపీ నేతలకు మధ్య గత కొంతకాలంగా మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories