మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులు అర్పించిన టీఆర్‌ఎస్‌ నేతలు

పీవీకి నివాళులు అర్పించిన టీఆర్‌ఎస్‌ నేతలు.. తెలుగు వారంటే కేంద్రానికి గౌరవం లేదు

Sandeep Reddy
Published on: 23 Dec 2021 6:35 PM IST
TRS leaders Pay Tribute On PV Narasimha Rao
X

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 17వ వర్ధంతి

Telangana: తెలుగు వారంటే కేంద్రానికి గౌరవం లేదని తెలంగాణ నేతలు ఆరోపించారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేసిన పీవీకి కేంద్రం నుంచి సరైన గౌరవం దక్కలేదని అన్నారు. ప్రమాద అంచున ఉన్న భారతదేశాన్ని తన ఆలోచనతో ఆర్థికంగా గట్టెకించారని ఎమ్మెల్సీ శ్రీవాణి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 17వ వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పించారు. పీవీ జ్ఞానభూమి వద్ద హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ శ్రీవాణి దేవి రాష్ట్ర ప్రభుత్వం తరపున పీవీకి నివాళులు అర్పించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story